Sunday, April 28, 2024

యథేచ్ఛగా ఫుట్‌ పాత్‌లు కబ్జా చేస్తూ నిర్మాణాలు

తప్పక చదవండి
  • మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు
    కీసర : దమ్మాయి గూడ మున్సిపాలిటీలో కొందరు అక్రమార్కులు ఏకంగా ఫుట్‌ పాత్‌లపైనే కబ్జా చేస్తూ నిర్మాణాలను చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..6వ వార్డు కుందన్‌ పల్లిలో హెచ్‌ఎమ్‌డిఏ అనుమతులతో కెఎస్‌ఆర్‌ వెంచర్‌ నిర్మించగా, దాని ప్రక్కనే ఆనుకొని 149 సర్వే నంబర్‌లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. కేఎస్‌ఆర్‌ హెచ్‌ఎండిఏ లేఔట్‌ నిబంధనలను అనుసరిస్తూ ఫుట్‌ పాత్‌లను నిర్మించి వదిలి వేయగా, ఆ ఫుట్‌ పాత్‌లను ఆక్రమిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కొంతమంది నిర్మాణదారులు నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిని మున్సిపాలిటీ ప్రజలు వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఆ దారి గుండా ఇతర వెంచర్లకు వెళ్లకుండా ఇబ్బందులు ఎదురవుతాయని, రాబోయే కాలంలో వాహనదారులు ఎక్కువ కావడం వల్ల నడవకుండా అడ్డుకుంటున్నారని, కావున ఫుట్‌ పాత్‌లు కబ్జాకి గురికాకుండా అలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు