Saturday, May 18, 2024

తెలంగాణలో బీసీల దమ్మేందో చూపండి

తప్పక చదవండి
  • బీసీలను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లను తరిమికొట్టండి
  • తక్షణమే బీసీలకు రాహుల్ గాంధీ, కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే
  • బీసీని సీఎం చేసే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది : రాజాసింగ్

హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు. తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. బీసీలను సీఎం చేస్తామని బీజేపీ చెబుతుంటే… కులం కంటే గుణం ముఖ్యమని ఒకరు, కుల గణన పేరుతో మరొకరు మాట్లాడుతూ బీసీ సీఎం నినాదాన్ని నీరుగార్చే కుట్ర చేస్తున్నారు. బీసీలను అడుగడుగునా అవమానిస్తున్నారు. 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీలంతా తమ దమ్ము చూపే సమయం వచ్చింది. తెలంగాణలోని బీసీలంతా ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలి. బీసీలంతా ఏకమై ఎన్నికల్లో ఆ పార్టీలను ఓడించి తెలంగాణ పొలిమేరల దాకా తరిమి తరమి కొట్టాలని కోరుతున్నని అన్నారు. బీసీలపట్ల రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ముందా? బీసీల పట్ల ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్, కేటీఆర్ లకు బీసీని సీఎం చేస్తామని ప్రకటించగలరా? కనీసం కల్వకుంట్ల కుటుంబ సభ్యులెవరూ సీఎం పదవి చేపట్టబోరని, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని అర్హులైన నాయకుడికి సీఎం పదవి ఇస్తామని చెప్పే సత్తా ఉందా? బీసీలపట్ల నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఓబీసీ నేత శ్రీ నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదే. 27 మంది ఓబీసీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన రికార్డు బీజేపీదే. దళిత, గిరిజన, మైనారిటీ నేతలను రాష్ట్రపతి చేసిన చరిత్ర బీజేపీది. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన పార్టీ బీజేపీ. తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యం. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. తెలంగాణ ప్రజలంతా వాస్తవాలు ఆలోచించి ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని రాజాసింగ్ కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు