Monday, May 13, 2024

ఆర్టీసీ బస్సు బోల్తా ఎనిమిది మందికి గాయాలు..

తప్పక చదవండి

అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా యర్ర గొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరాబాద్ నుంచి మార్కాపురం వస్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన108లో యర్రగొండపాలెం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు