చౌటుప్పల్ : ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న ప్రవేట్ స్కూల్ బస్సులపై భువనగిరి జిల్లా రవాణా అధికారి వై సురేందర్ రెడ్డి అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రవేట్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ స్కూళ్లకు సంబంధించిన ఏడు బస్సుల పర్మిట్, ఇన్సూరెన్స్, ఎఫ్ సి,,ఓవర్ లోడ్ తో నడుపుతున్న బస్సులను సీజ్ చేసి, భువనగిరి డిటివో ఆఫీస్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి సురేందర్ రెడ్డి ,సిబ్బంది పాల్గొన్నారు.