Saturday, May 4, 2024

తనిఖీల్లో రూ .99 లక్షల నగదు పట్టివేత

తప్పక చదవండి

హైదరాబాద్ : హైదరాబాద్ సిటీలో మరోసారి భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ .99 లక్షల నగదు సీజ్ చేశారు. సోమవారం చందానగర్ యస్ఓటీ మాదాపూర్ పోలీసులు చందానగర్ మెయిన్ రోడ్ ఎదురుగా జాకీ షోరూం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తీసుకువెళుతున్న రూ.99 లక్షలను వైదల నాగరాజు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు