Saturday, May 18, 2024

కాంగ్రెసోళ్లు కర్ణాటక ప్రజలను మోసం చేశారు

తప్పక చదవండి
  • ఫతేపూర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో గౌసియా బేగం

మహబూబ్ నగర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ రూరల్ మండలం ఫతేపూర్ గ్రామానికి వెళ్ళిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేస్తూ గౌసియా బేగం ఇంటికి వెళ్లారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న గౌసియా బేగంను చూసి మంత్రి… అక్కా ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించారు. రాబోయే ఎన్నికల్లో బూటకపు హామీలు ఇస్తున్న పార్టీలను నమ్మవద్దు అభివృద్ధి చేస్తున్న కారు గుర్తుకు అండగా ఉండాలని మంత్రి గౌసియా బేగంను కోరారు. నిజమే శీనన్న కర్ణాటకలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్లు… ఆ తర్వాత ప్రజలను వంచించారని కరెంటు లేక కన్నడ ప్రజలు పడుతున్న కష్టాలు పేపర్లలో రోజు చదువుతున్నామని అన్నారు. కర్ణాటక లాగా ఇక్కడ కూడా ఉన్న కరెంటు పోగొట్టడానికి వస్తున్నారని.. మేం వారిని రానివ్వమని పేర్కొంది. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి నుంచి ఆడబిడ్డలకు బాధ కలగకూడదనే ఉద్దేశంతో రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని… నెల రోజుల తర్వాత మీ కష్టాలు తీరుతాయని మంత్రి తెలిపారు. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా మీరు ఓట్ల కోసం మా వద్దకు రావాల్సిన అవసరం లేదని, మీకు ఓటు వేయడం మా బాధ్యత అని గౌసియా బేగం పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు