Monday, April 29, 2024

మలేషియాకు ఇక వీసా అక్కర్లేదు..

తప్పక చదవండి
  • డిసెంబర్ 3 నుంచి మొదలుకానున్న ఆఫర్
  • 30 రోజులపాటు అక్కడ గడిపేందుకు ఛాన్స్
  • భారత్‌తోపాటు చైనా పౌరులకు కూడా ఆఫర్
  • విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే మలేసియా లక్ష్యం

తమ దేశంలో పర్యాటకం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు, ముఖ్యంగా భారతదేశం, చైనా నుండి పర్యాటకులు వీసా లేకుండా తమ దేశానికి రావడానికి అనుమతించబడ్డారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం వెల్లడించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వివరాలు చెప్పారు. భద్రతకు సంబంధించిన స్క్రీనింగ్ మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులు, ఇన్వెస్టర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీసాతో ముడిపడిన ప్రక్రియను సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు గత నెలలోనే ప్రధాని అన్వర్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్, చైనా దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యాలను కల్పించనున్నట్టు చెప్పారు. దేశంలోకి పర్యాటకుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందని మలేసియా ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు