- ఆరుసూత్రాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేరేడుచర్ల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని, దీని కోసమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికునివలే పనిచేయాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో సోమవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై రామా పురం మాజీ సర్పంచ్ చింతమల్ల సైదులు ఆధ్వర్యంలో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమైన పదవిలో ఉండటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాత కొత్త అనే భేదాభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి పనిచేసే రామాపురం గ్రామంలో 750 మెజార్టీ తీసుకురావాలని కోరారు.గెలిచిన తర్వాత అర్హులైన లబ్ధిదా రుల అందరికీ ఇల్లు కట్టిస్తానని రామాపురం గ్రామంలో వైకుంఠ ధమం లేక ఇబ్బందులు పడు తున్న విషయం తెలిసిందని తప్పక కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి టౌన్ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి, రణపంగ. నాగయ్య, మోతిలాల్ నాయక్, కొణిజేటి జ్యోతి బాబు, కట్టా సత్యనారాయణ రెడ్డి, తాల్ల సురేష్ రెడ్డి, పిల్లల మర్రి హరిబాబు, మెండే జానయ్య చందమల్ల జానయ్య, జానీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.