- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ – భారతి హోలికేరి
ఇబ్రహీంపట్నం : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జిల్లాలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కొరకై రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కొంగరకాలన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్:040-23238545కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ లో (24) గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని, రిజిష్టర్ ఏర్పాటు చేసి వచ్చిన పిర్యాదులను రికార్డ్ చేస్తూ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు తెలంగాణ శాసనసభ ఎన్నికలు-2023 కు సంబంధించి ఫిర్యాదులకై ఈ టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ కోరారు.