అమరావతి : సైకో జగన్ పోతేనే ఏపీకి పట్టిన పీడ విరగడవుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ ‘‘జగన్రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్ని చంపితే, ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్పై హత్యాయత్నం చేశారు. కావలిలో రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్ తీయాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టడమే నేరమైంది. నడిరోడ్డుపై పట్టపగలు వైసీపీ నేతలు గూండాల కంటే ఘోరంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ సైకో జగన్ ఫ్యాక్షన్ ప్రదేశ్గా మారిపోయింది. సైకో జగన్ పోతేనే, ఇలాంటి పిల్ల సైకో గ్యాంగులన్నీ పోతాయి’’ అని నారా లోకేష్ మండిపడ్డారు.