Monday, April 29, 2024

ఢిల్లీలో విషమించిన పరిస్థితి..

తప్పక చదవండి
  • తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం..
  • స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • ఈ నెల 10 వరకు ఆన్ లైన్ లో బోధించాలని ఆదేశాలు
  • 6, 7 తరగతులు కొనసాగించవచ్చని సూచన
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి ఆతిషి
  • ఢిల్లీలో బయటకు రావడానికి భయపడుతున్న జనం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. గాలి నాణ్యత కనిష్ట స్థాయులకు పడిపోవడంతో ఆప్ సర్కారు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల 5 వరకు సెలవులు ప్రకటించగా.. ప్రస్తుతం ఈ నెల 10 వరకు పొడిగించింది. గతవారం రోజుల నుంచి వాయు నాణ్యత సూచి 400పైగా నమోదవుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పూరిత నగరాల జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలు టాప్-10లో ఉన్నాయి. ఆ జాబితాలో ఏఐక్యూ 483తో ఢిల్లీ తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో లాహోర్ (పాకిస్థాన్), కోలకతా (భారత్), ఢాకా (బంగ్లాదేశ్), కరాచీ (పాక్), ముంబయి (ఢిల్లీ), షాంఘై, హౌంగ్జూ (చైనా), కువైట్, వుహాన్ (చైనా) నిలిచాయి.

కోల్‌కతా, ముంబయి ఏక్యూఐ వరుసగా 206, 162గా నమోదయ్యాయి. రెండో స్థానంలో ఉన్న లాహోర్‌లో వాయు నాణ్యత 370గా ఉంది. ఇక, ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితికి అత్యల్ప ఉష్ణోగ్రతలు, గాలివేగం తగ్గడం,హరియాణ, పంజాబ్‌లో వంట వ్యర్థాలను రైతులు తగులబెట్టడమే కారణమని అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతంలో వాయు నాణ్యత సూచి 550 మించిపోగా.. ఢిల్లీ నగరం మొత్తం దుమ్ము పట్టినట్టు మారిపోయింది. దీంతో రెండు కోట్ల జనాభాలో చాలా మందికి కంటి దురద, గొంతు నొప్పి వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

వాయు నాణ్యత 0 నుంచి 50 మధ్య ఉంటే స్వచ్ఛమైందిగా పరిగణిస్తారు. కానీ, 400 నుంచి 500 మంది ఉంటే చాలా ప్రమాదమని, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘నా చివరి 24 గంటల డ్యూటీలో పిల్లలు దగ్గడం, గొంతునొప్పితో బాధపడటం.. వేగంగా శ్వాస తీసుకోవడం నేను చూశాను’ అని ఢిల్లీకి చెందిన అహ్మద్ ఖాన్ అనే ఓ వైద్యుడు ట్విట్టర్‌లో తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు