Thursday, May 16, 2024

రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

తప్పక చదవండి

ములుగు : జిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను స్కూలు బస్సు ఢీ కొట్డంతో కూతరు మృతి చెందదగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఖాతా రమేశ్ ఏడాది వయసున్న తన కూతురితో శుక్రవారం ఉదయం తన బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గోవిందరావుపేట పస్రాకు చెందిన సెయింట్ మేరీస్ స్కూల్ కు చెందిన బస్సు అటుగా వచ్చింది. రమేశ్ తన కూతురిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకుని వెళ్తుండగా.. వెనుకనుంచి వేగంగా వచ్చిన స్కూల్ బస్సు అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పై వెళ్తున్న తండ్రీకూతురు ఇద్దరూ కిందపడటం తలకు దెబ్బతగలడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రమేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు హుటాహుటిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారవగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఊహించని ప్రమాదంలో ఏడాది వయసున్న చిన్నారి చనిపోవడం, తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవడంతో కుటుంబ సభ్యులు రోధించిన తీరు అందరినీ కలచివేసింది. ఇదిలాఉంటే స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, తగిన యాక్షన్ చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు