Saturday, May 4, 2024

భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ నేరెళ్ల లావణ్య అశోక్

తప్పక చదవండి

సిర్పూర్ టి : మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎంపీటీసీ నేరెళ్ల లావణ్య అశోక్ వారి అనుచర దళంతో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరారు. డా.పాల్వాయి హరీష్ బాబు వారికీ బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భాజపా సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ మండలంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రజలందరూ తిరగబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించకుండా చేసిన ఘనత సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కే దక్కింది అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నీరేటి రేఖ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, మండల అధ్యక్షులు ఎల్మలే శంకర్, ఎంపిటిసి పిర్సింగుల తిరుపతి, సర్పంచ్ దోతుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాచర్ల మహేష్ యాదవ్, ఒడ్డేటి నానయ్య, అల్లూరి శ్రీశైలం, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు చన్కపురి లావణ్య, మామిడి బాలాజీ, మల్లికార్జున్ గౌడ్, దుర్గం ప్రశాంత్, సాయి భాస్కర్, దొరికే బావుజి, జాగరి రమేష్, శ్యామ్ రావు, దండిక బాపు, దందరే శంకర్, చౌదరి భగవాన్, గురజాల మొండి, హరిలాల్, బెతం దేవాజి, ధన్రాజ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు