Saturday, May 18, 2024

బీఆర్ఎస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు

తప్పక చదవండి

మేడ్చల్ ; మేడ్చల్ మండలంలోని బండమాదారం గ్రామానికి చెందిన సుమారు 30 మంది వివిధ పార్టీల నాయకులు, యువకులు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ చామకూర మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బండమాదారం గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వారికి మహేందర్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఒక్క బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుండి చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ ఛైర్మన్ సత్యనారాయణ, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మేడ్చల్ జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు విజయానంద రెడ్డి, డబిల్ పూర్ పీఏసీఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, మెట్టు శ్రీకాంత్ రెడ్డి, యూనిస్, రఘుపతిరెడ్డి, భాస్కర్, నాయకులు, యువకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు