శేరిలింగంపల్లి : చందానగర్ సర్కిల్ మాదా పూర్ అయ్యప్ప సోసైటీలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సోమవారం జోనల్ సీసీపీ మల్లికార్జున్, చందానగర్ ఏసీపీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పర్మిషన్ లేని బిల్డింగ్స్ ను జేసీబీల సహాయంతో కూల్చేశారు. ఉదయమే అయ్యప్ప సోసైటీ చేరుకున్న అధికారులు ఐదు జేసీబీలతో అక్రమ కట్టడాలను డిమాలిస్ చేశారు. ఈ సందర్భంగా సీసీపీ మల్లికార్జున్,ఏసీపీ రాజ్ కుమార్ మాట్లాడుతూ..అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్మిషన్ లేని భవంతుల నిర్మాణాలపై కఠినమైన చర్యలుంటాయన్నారు. కూల్చివేతలు ఇక ముందు కూడా కొనసాగుతాయన్నారు. ఇవాళ కూడా కూల్చివేతల కార్యక్రమం ఉంటుందన్నారు. అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో చైన్ మెన్లు గడ్డం శ్రీనివాస్,ఐలయ్య యాదవ్,క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.