న్యూఢిల్లీ : దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నిధుల సవిూకరణకు త్వరలో ‘క్రౌడ్ ఫండిరగ్’కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఏడీఆర్ గణాంకాల ప్రకారం కాంగ్రెస్ వద్ద రూ.805.68 కోట్ల నిధులుంటే బీజేపీ వద్ద రూ 6,046.81 కోట్లు ఉన్నాయి. హస్తం పార్టీకి అందుతున్న విరాళాలు తగ్గుముఖం పట్టాయి. బీజేపీకి అందిన కార్పొరేట్ విరాళాల మొత్తం` ఇతర అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఐదు రాష్టాల్ర ఎన్నికల తర్వాత క్రౌడ్ఫండిరగ్ ప్రచారం ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.