హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)కు ఇటీవల దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 14,187 దరఖాస్తులు అందాయి. అతి తక్కువగా భూపాలపల్లి జిల్లాలో 1,338 మాత్రమే వచ్చాయి. రాష్ట్రవ్యా ప్తంగా 5,089 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358 ఖాళీలు ఉండగా.. ఎక్కువ దరఖాస్తులు కూడా అదే జిల్లా నుంచి అందాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43 పోస్టులు ఉన్నాయి. ఆ జిల్లా నుంచి 2,209 దరఖాస్తులు వచ్చాయి. అయితే 74 ఉద్యోగాలున్న భూపాలపల్లి జిల్లా నుంచి అతితక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం విూద రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 1,77,502 దరఖాస్తులు అందాయి. కొందరు అభ్యర్థులు తమ అర్హతను బట్టి రెండు, మూడు పోస్టులకు పోటీ పడతారు. 2017 టీఆర్టీతో పోల్చుకుంటే ఈ సారి దాదాపు లక్ష దరఖాస్తులు తగ్గాయి.