- మల్లారెడ్డీ.. నీకు దమ్ముంటే బోయినపల్లిలో పోటీ చెయ్..
- మెడికల్ కాలేజ్ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా : వజ్రేష్ యాదవ్
షామీర్పేట్ : తోముకుంట మున్సిపాలిటీ పరిధిలో ని హకీంపేట్, తోముకుంట లో తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను వివరిస్తూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం తూముకుంటలో విలేఖర సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూముకుంట మున్సిపాలిటీ నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సింది పోయి ఇష్టానుసారంగా టాక్స్లు వేసుకుంటూ పోతే ప్రజలు ఏమైపోవాలని ప్రశ్నించాను.ప్రజలు అంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేదా ప్రజా పరిపాలన నా లేక కార్పొరేట్ కంపెనీ అని ప్రశ్నించారు. మల్లారెడ్డి గుండా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మల్లారెడ్డి మేడ్చల్ ఏమైనా నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా మేడ్చల్ ప్రజలు ఏమైనా నీ కాలేజీలో జీతాలకు పనిచేస్తున్నారు అనుకుంటున్నావా నీకు దమ్ముంటే బోయినపల్లిలో పోటీ చెయ్ నువ్వు మళ్ళీ పూలు పాలు అమ్ముకునే స్థాయికి నిన్ను తీసుకెళ్తా అని ఆయన విమర్శించారు.మల్లారెడ్డి నువ్వు గెలిచిన తర్వాత స్థానిక జర్నలిస్టులకు 60 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని మాట తప్పవు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక జర్నలిస్టులకి 60 గజాల ఇంటి స్థలం అర్హులైన వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఆయన అన్నారు.ఈ మేడ్చల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకురాకపోతే నేను మళ్ళీ మేడ్చల్ ప్రజలను ఓటు వేయమని అడగను రాజకీయాలనుండి తప్పుకుంటాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అద్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ,తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బాలేష్ ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.