Monday, April 29, 2024

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

తప్పక చదవండి
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
    కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ వార్డు 5 పరిధిలోని సంజీవయ్య నగర్‌లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డప్పు దరువులతో స్థానికులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనంది తతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ నిరుపేద ప్రజలందరికీ బస్తీ దవాఖానాల ద్వారా ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్న దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందితను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గజ్జెల నాగేశ్‌, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్‌, సీనియర్‌ నాయకులు టీఎన్‌ శ్రీనివాస్‌, నర్సింహ ముదిరాజ్‌, పనస సంతోష్‌, సదానంద్‌ గౌడ్‌, వంగల మల్లేశ్‌, మురళి యాదవ్‌, భాస్కర్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు