Saturday, May 4, 2024

కలిదిండి పవన్‌ కుమార్‌.. ఇతగారు ఓ మోసగాడు

తప్పక చదవండి

కలిదిండి పవన్‌ కుమార్‌.. ఇతగాడు ఒక బడా చోర్‌.. అమాయకుల ఆశలే ఇతనికి పెట్టుబడి.. 12 వెల్త్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యాలయం.. దీనికి ఈయన మేనేజింగ్‌ డైరెక్టర్‌.. ప్లాట్‌ నెంబర్‌ : 10, ఫ్లాట్‌ నెంబర్‌ 202, సెకండ్‌ ఫ్లోర్‌, అనసూయ నిలయం, వివేకానంద నగర్‌ కాలనీ, బాఫ్మీురి, కూకట్‌ పల్లి, హైదరాబాద్‌ కేంద్రంగా కళ్లుచెదిరే ప్లానులకు రూపకల్పన చేసి తన మాయమాటలతో ఎంతో మంది అమాయకులను మోసం చేశాడు.. ఇప్పటికీ చేస్తున్నాడు.. అతగాడి నయాదందాపై ఇప్పటికే కథనాలు ప్రచురించింది ఆదాబ్‌ హైదరాబాద్‌.. కానీ కుక్కతోక వంకర అన్న చందాన అతగాడి మోసపూరిత దందా మాత్రం మారలేదు..

  • 12 వెల్త్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. పేరిట నయాదందా..
  • మహాగొప్ప పెట్టుబడి అంటూ కల్లబొల్లి కబుర్లు..
  • రూ. 4 లక్షలు ఇన్వెస్ట్‌ చెయ్యండి.. నెలకు రూ. 16 వేలు తీసుకోండి..
  • 25 నెలల పాటు చెల్లిస్తానని అబద్దపు ప్రచారం..
  • ఒక గుంట వ్యవసాయ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ చేస్తాడు..
  • 25 నెలల అనంతరం రూ. 4 లక్షలు కలిపి రూ. 8 లక్షలు తిరిగి చెల్లిస్తామంటాడు..
  • చెల్లించిన పిదప తిరిగి గుంట భూమిని కంపెనీకి రిజిస్ట్రేషన్‌ చెయ్యాలని కండిషన్‌..

హైదరాబాద్‌ : 12 వెల్త్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కూకట్‌ పల్లిలో అద్భుతమైన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు.. ఇక మోసపూరిత దుఖాణం తెరిచేశాడు.. తన జిత్తులమారి తెలివితేటలకు పదును పెట్టాడు.. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశపడే అమాయకులకు వల వేశాడు.. ఇప్పటికీ వేస్తూనే ఉన్నాడు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతోమందిని నిలువునా ముంచాడు.. తన కంపెనీలో నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే.. నెలకు రూ. 16 వేలు చెల్లిస్తాను.. ఈ విధంగా 25 నెలల పాటు చెల్లిస్తానని కబుర్లు చెబుతాడు.. అదే కాకుండా అడ్రస్‌ లేని భూమిలో ఒక గుంట వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తానని మభ్యపెట్టి, వంద రూపాయల స్టాంప్‌ పేపర్‌ మీద అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ విత్‌ పొజిషన్‌ అంటూ బోగస్‌ సేల్‌ డీడ్స్‌ ఇస్తూ దర్జాగా మోసం చేస్తాడు.. చేస్తూనే ఉన్నాడు.. 25 నెలల అనంతరం రూ. 4 లక్షలు కలిపి మొత్తం రూ. 8 లక్షలు చెల్లిస్తాను అని చెబుతాడు.. అమౌంట్‌ చెల్లించిన తరువాత ఒక్క గుంట వ్యవసాయ భూమిని తిరిగి కంపెనీ పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయాలనే కండిషన్‌ పెట్టాడు.. ఒకవేళ రూ. 8 లక్షలు చెల్లించని పక్షంలో ఆ ఒక్క గుంట భూమి వారికే చెందుతుందని హరికథలు చెబుతాడు.. అయితే అసలు ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు..
ఒక్క గుంట వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారో అర్ధం కాదు..

- Advertisement -

సంగారెడ్డి జిల్లా, ఆంథోల్‌ మండలం, ఆంథోల్‌ జోగిపేట డివిజన్‌, రామ్‌ సాన్‌ పల్లి గ్రామంలో భూమి ఉందని, ఆ సర్వే నెంబర్‌ 490/లూ గా చెబుతూ బై నెంబర్లు వేసి బోగస్‌ గిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం ఇతగాడి స్పెషాలిటీ.. కాగా బాధితులైన అమాయకులు కట్టిన డబ్బును షేర్స్‌ లో, ఈ కామర్స్‌ లో, మ్యూచువల్‌ ఫండ్స్‌, గోల్డ్‌ లో, బియర్‌ మార్కెట్‌, ఇన్సూరెన్స్‌, గ్రోత్‌ లో, ట్రేడిరగ్‌ లో, రియల్‌ ఎస్టేట్‌ లో మై షేర్స్‌ లో, యుటిలిటీలో ఇన్వెస్ట్‌ చేసి, లాభాలు గడిస్తున్నాను కనుక మీ డబ్బులకు ఎలాంటి డోకా లేదని నమ్మబలుకుతాడు.. నిజానికి అతగాడు చెబుతున్నట్లుగా అక్కడ అసలు భూమి లేదు.. తాను చెబుతున్నట్లుగా 490/ లూ సర్వే నెంబర్‌ లో 120 ఎకరాల భూమి వున్నట్లుగా కలరింగ్‌ మాత్రం ఇస్తాడు.. ఇదే కాకుండా ఇతగాడి ఆధ్వర్యంలో నడుస్తున్న కలిదిండి రీసార్ట్స్‌ లో ఒక వారం రోజులపాటు డబ్బులు ఇన్వెస్ట్‌ చేసిన వారికి అకామిడేషన్‌ ఇస్తాడు.. డిజిటల్‌ మాయాజాలంతో.. రంగురంగుల బ్రోచర్లతో తన అరచేతిలో స్వర్గాన్ని చూపించి తడిగుడ్డతో గొంతులు కోయడం కలిదిండి పవన్‌ కుమార్‌ కి వెన్నతో పెట్టిన విద్య..
అసలు 12 వెల్త్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సదరు వ్యక్తి పవన్‌ కుమార్‌ చేస్తున్న అనేకానేక మోసాలపై ఆదాబ్‌ వెలుగులోకి తీసుకుని వచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. మరి వీరంతా నిద్రపోతున్నారా..? లేక ఇతగాడు ఇస్తున్న లంచాలకు లొంగిపోతున్నారా..? అన్నది తేలాల్సివుంది.. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు మేలుకుని ఇతగాడి మోసపూరిత దందాపై చర్యలు తీసుకుని అమాయకులను కాపాడాలని ఆదాబ్‌ కోరుతోంది.. లేని యెడల న్యాయపోరాటం చేస్తామని మరీ హెచ్చరిస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు