- సమాధానం ఇచ్చేనందుకు సమయం కావాలని కోరిన సీఐడీ..
- వచ్చే సోమవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు..
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి విచారణ వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి తన క్వాష్ పిటిషను హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన సవాల్ చేయగా.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో 17 ఏ అమలు కాలేదని చంద్రబాబు లాయర్లు వాదించగా.. సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని సీఐడీ కోరడంతో విచారణ వాయిదా పడింది.