ముంబై : ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టిం చింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసు పత్రికి తరలించారు. సీ లింక్లో టోల్ ఎªలాజాకు 100 విూటర్ల సవిూపంలో వేగంగా దూసుకొచ్చిన ఇ న్నోవా కారు తొలుత మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొట్టింది. అప్పటికీ ఆగకుండా మరో నాలుగు వాహ నాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ్ తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పిరస్థితి విషమంగా ఉందని చెప్పారు.