విజయవాడ : రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్లో బస్సు ప్రమాదం ఆందోళనకు గురి చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన బస్సు ప్రమాదంపై విూడియాతో మాట్లాడుతూ ఈ బస్టాండ్కు నిత్యం వేలాది మంది ప్రయాణం నిమిత్తం ప్రయాణికులు వస్తుంటారన్నారు. అటువంటి బస్టాండ్లో ఈ తరహా సంఘటన చోటు చేసుకోవడం ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. జరిగిన సంఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహకారాన్ని అందించాలని… ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.