Thursday, May 16, 2024

బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా బీజేపీ విధానాలు

తప్పక చదవండి
  • బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేలా చర్యలు
  • కాంగ్రెస్‌కు తమ మద్దతు ఉంటుందన్న సీతారం ఏచూరి

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు మద్దతుగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. హంగ్‌ ఏర్పడితే మద్దతు ఇచ్చి బిఆర్‌ఎస్‌ను ప్రభుత్వంలో కూర్చోబెట్టే ప్రణాళికలు చేస్తోందని విమర్శించారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదని.. ఐదు రాష్టాల్ల్రో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలం ఉన్నా… ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని తెలిపారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్‌ కమిషన్‌, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బంది అయ్యాయని ఆరోపించారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని విమర్శించారు. ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదన్నారు. ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌కు ఎవరు అనుమతి ఇచ్చారో… ఆ ఘటనకు బాధ్యత ఎవరు వహించాలని ప్రశ్నించారు.ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘనకు మోడీ పాల్పడుతున్నారని అయినా ఈసీఐ నోటీసులు ఇవ్వదన్నారు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్‌ ఉందన్నారు. యాంటి బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ ఒంటరిగా పోటీ చేస్తున్నారన్నారు. హంగ్‌ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఉంటుందని… ఇండియా కూటమిలో ఇప్పటికే ఉన్నామని చెప్పుకొచ్చారు. సీపీఎం ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా పొత్తులు అనేది అసంభవమని సీతారాం ఏచూరి తేల్చిచెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు