- కంటెయినర్ను ఢీకొన్న ఆర్టీసి బస్సు
రంగారెడ్డి : రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని మొయినాబాద్ సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహ్మద్ గౌస్ అక్కడికక్కడే మృతి చెందగా.. అబ్దుల్ రహీమ్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేతిరెడ్డి పల్లిలో ఉన్న ఫ్యాన్ షాప్ కట్టేసి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహ్మద్ గౌజ్, అబ్దుల్ రహీమ్ ఇద్దరు స్నేహితులుగా తెలుస్తోంది. మరోఘటన కూడా ఇదే జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం నందిగామ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ తో పాటు ప్రయాణికులకు తీవ్రగాయాయ్యాయి. క్షతగాత్రులను సవిూప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిరచారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.