Thursday, May 16, 2024

తెలంగాణలో బీజేపీ ప్రచారహోరు

తప్పక చదవండి
  • సుడిగాలి పర్యటనలతో ప్రధాని మోడీ ప్రచారం
  • తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం
  • తొలి బిసి ముఖ్యమంత్రిని నియమిస్తామని ప్రకటన
  • అంథ విశ్వాసాల ముఖ్యమంత్రి అసవరం లేదని వ్యాఖ్య
  • పివిని అవమానించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపు
  • హుజూరాబాద్‌తో ట్రైలర్‌ చూపామని వ్యాఖ్య
  • కరీంనగర్‌,మహబూబాబాద్‌ సభల్లో ప్రధాని మోడీ ప్రచారం

మరో 24 గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రస్థాయి నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్‌,కరీంనగర్‌లో బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆట ముగియనుంది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. తెలంగాణ బీజేపీ తొలి సీఎం బీసీయే అవుతారు. చరిత్రలో 16 మహాజనపదాల్లో అస్మక జనపదం ఈ ప్రాంతం. హుజూరాబాద్‌ ఉపఎన్నికతో కేసీఆర్‌కు ట్రైలర్‌ చూపించాం. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు‘ అని ప్రధాని మోదీ అన్నారు. పీవీ నరసింహరావుని కాంగ్రెస్‌ పార్టీ ప్రతి అడుగులో అవమానించిందని హస్తం పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సర్కార్లు అవసరం లేదని మోదీ అన్నారు. గ్యారెంటీలను నెరవేర్చే మోదీ సర్కార్‌ తెలంగాణకు అవసరమని అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఆరోగ్యం, మోదీ గ్యారెంటీ అంటే రైతులకు చేయూత అని అన్నారు. ప్రజా సంక్షేమమే బీజేపీ ప్రాధాన్యతని, ఓ వైపు కేసీఆర్‌ ఉన్నారు.. మరో వైపు విూ సేవకుడు మోదీ ఉన్నాడని ప్రధాని అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనను ఎండగట్టారు. ప్రధాని మోదీ పదే పదే తెలుగులో మాట్లాడుతూ, తెలుగు పదాలు చెబుతూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్టాన్ని సాధించుకున్నా కేసీఆర్‌ కుటుంబపాలనతో ఏ లక్ష్యాలు నెరవేరలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు బదులుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగాలతో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్టాల్లో పెట్రోల్‌, డీజిల్‌ విూద పన్ను తగ్గించాం. కానీ తెలంగాణ లాంటి రాష్టాల్లో పెట్రోల్‌ విూద పన్ను తగ్గించలేదన్నారు. తద్వారా ప్రజల విూద భారం పడిరదని, కేసీఆర్‌ పాలనకు ఇది నిదర్శనం అన్నారు. ఇప్పటికే పదేళ్లు గడిచిపోయాయని, వచ్చే ఐదేళ్లు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ కు చాలా కీలకమన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం తల్లిదండ్రులు తపన పడుతున్నారని, వారి కలలు సాకారం కావాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభివృద్ధి కోరుకుంటే కమలం గుర్తుకు విూ ఓటు వేయాలి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుటుంబపార్టీలు అని, వారి వల్ల కేవలం ఒకట్రెండు కుటుంబాలు బాగుపడతాయని, రాష్ట్రంలోని అన్ని వర్గాలవారికి అన్యాయం జరుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే పీఎఫ్‌ఐ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఊతం వస్తుందని, కనుక ప్రజలు ఆలోచించి ఓటు వేసి వారి బంగారు భవిష్యత్‌ కు బాటలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు.తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు మూఢ నమ్మకాలు ఎక్కువ అని, అందుకే సచివాలయం కూల్చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మహబూబాబాద్‌ సభలో విమర్శించారు. అంధ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేసిన ఘనుడు కేసీఆర్‌ అన్నారు. తన నమ్మకాల కోసం ప్రజా ధనం వృథా చేసి సెక్రటేరియట్‌ కూల్చివేసిన సీఎం కేసీఆర్‌ మనకు అవసరమా అని మోదీ ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పసభలో పాల్గొన్న మోదీ మాట్లాడతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌ పై విమర్శలు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్‌ కు ట్రైలర్‌ చూపించారని, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సినిమా చూపిస్తారంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని, అవినీతిపరులను కచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తెలంగాణను నాశనం చేశాయని, బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్‌ తమతో దోస్తీ కోసం ప్రయత్నించారని, అందులో భాగంగా గతంలో కేసీఆర్‌ దిల్లీకి వచ్చి బీజేపీతో కలిసి పనిచేస్తామని అడిగినట్లు మరోసారి ప్రధాని ప్రస్తావించారు. అయితే తన కుమారుడు మంత్రి కేటీఆర్‌ ను తెలంగాణకు సీఎంగా చేయాలని కోరగా.. కేసీఆర్‌ విజ్ఞప్తిని తిరస్కరించడంతో తమపై విమర్శలు మొదలుపెట్టారని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు