Monday, May 27, 2024

జీ20 సదస్సును ముగించుకొని బయలుదేరిన బైడెన్..

తప్పక చదవండి
  • వియాత్నం కి వెళ్లిన అగ్రదేశాధినేత..
    న్యూ ఢిల్లీ : అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ జీ20 సదస్సును ముగించుకొని వియత్నాం బయల్దేరారు. ఆదివార ఉదయం ఆయన రాజ్‌ఘట్‌లోని మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తన ఎయిర్‌ ఫోర్స్‌వన్ విమానంలో బయలుదేరి వెళ్లారు. మరో విషయం ఏంటంటే జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత ఇండియాలో తొలిసారిగా పర్యటించారు. శుక్రవారం రోజున ఆయన తన పర్యటనలో మొదటిరోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే బైడెన్ వియాత్నం ఎందుకు వెళ్లనున్నారనే విషయంపై ప్రశ్నలు వచ్చాయి. అయితే అక్కడ కూడా ఆయన ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై దృష్టి సారించనున్నారు. అలాగే ఆదివారం, సోమవారాల్లో ఆయన ఉండనున్నారు. అక్కడ జరగనున్న కార్యకలాపాల్లో కూడా ఆయన మాస్క్ ధరించే పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా బైడెన్ కాన్వాయ్‌లో ఓ డ్రైవర్‌ను శనివారం రాత్రిపూట భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే అతడి కదలికలు అనుమానస్పదంగా కనిపించాయి. దీంతో అతడిని దళాలు ప్రశ్నించాయి. అలాగే బైడెన్ తన కాన్వయ్‌లోని కొన్ని వాహనాలు నేరుగా అమెరికా నుంచే వచ్చాయి. అలాగే మరికొన్నింటిని భారత్‌లోనే కేటాయించారు. అయితే వీటిల్లో అద్దెతు తీసుకున్న కారు కూడా ఒకటి ఉంది. మరో విషయం ఏంటంటే బైడెన్ బసచేసేటటువంటి హోటల్.. ఐటీసీ మౌర్య వద్ద ఉండాల్సి ఉంది. అలాగే యూఏఈ పాలకుడు అయిన అల్ నహ్యన్ బస చేస్తు్న్న తాజ్ హోటల్ వద్ద కూడా అది కనిపించింది. అయితే ఓ వ్యాపారవేత్తను అక్కడ డ్రాప్ చేసేందుకు తాను వచ్చినట్లు ఆ డ్రైవర్ అధికారులు వివరించాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ గురించి మాత్రం తనకు తెలియదని అన్నారు. అయితే అతడ్ని కొన్ని గంటల వరకు ప్రశ్నించిన తర్వాత భద్రతా దళాలు అతడ్ని చివరికి వదిలేసి వెళ్లాయి.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు