- ఏపీ స్కిల్ స్కాం కేసులో మరో ట్విస్ట్..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కోర్డుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 28 పేజీలతో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. అసలు స్కిల్ స్కామ్ ఎలా జరిగిందన్న విధానాన్ని సీఐడీ వివరించింది. చంద్రబాబే కుట్రకు సూత్రధారి అని సీఐడీ తెలిపింది. ఇక రిమాండ్ రిపోర్ట్లో చంద్రబాబు తనయుడు లోకేష్ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. కిలారి రాజేశ్ ద్వారా లోకేష్కు డబ్బులు అందాయని సీఐడీ తెలిపింది. అలాగే చంద్రబాబు పీఎ శ్రీనివాస్కు కూడా డబ్బులు అందాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్నారు. ఇవాళ ఆదివారం కోర్డుకు సెలవు కావడంతో ఓపెన్ కోర్టులో విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఓపెన్ కోర్డులో విచారణ తప్పనిసరిగ కాదని న్యాయమూర్తి తెలిపారు. ఇదే అంశంపై న్యాయమూర్తి కాసేపట్లో దేశాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రిమాండ్ రిపోర్ట్లో సంచలన అభియోగాలు పేర్కొన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ కుట్ర జరిగిందని సీఐడీ చెబుతోంది.