- ఘన విజయం సాధించిన కె. రమేష్ బాబు, వీరమాచినేని సత్యనారాయణ ప్యానల్..
- ఆదివారం 8 గంటలనుండి 3 గంటలవరకు ఎన్నికల నిర్వహణ..
- ఫలితాలు ప్రకటించిన జింఖానా క్లబ్ అధికారులు..
హైదరాబాద్ లో జరిగిన ప్రతిష్టాత్మక జింఖానా క్లబ్ ఎన్నికల్లో కే. రమేష్ బాబు, వీరమాచినేని సత్యనారాయణల ప్యానల్ గెలవడం జరిగింది.. ఆదివారం రోజు ఉదయం 8 గంటలనుండి 3 గంటలవరకు ఎన్నికల నిర్వహణ జరిగింది.. ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి..
అందిన ఫలితాల ప్రకారం రమేష్ బాబు కొండ్రగుంట చైర్మన్ గా.. సత్యనారాయణ వీరమాచినేని సెక్రెటరీగా.. వైస్ చైర్మన్ గా చందుపట్ల సత్యనారాయణ రెడ్డి.. జాయింట్ సెక్రెటరీగా ఆర్. కృష్ణమోహన్.. ట్రెసరర్ గా పీ. వేణుగోపాల్ రావు.. ఇక డైరెక్టర్స్ గా చలమయ్య వెంకట కామేపల్లి.. మధుబాబు దొడ్డ.. మోహన్ వడ్లపట్ల.. వై.ఎస్. రామరాజు.. సోమా నరసింహారెడ్డి కోడూరు.. వెంకటేశ్వర రావు కర్నాటి.. వై. సీతారామ రాజు.. కె.ఎస్.ఎన్. రెడ్డి లు ఎన్నికైనట్లు జింఖానా క్లబ్ అధికారులు ప్రకటించారు.. ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపిన పలువురు..