Friday, May 17, 2024

తల్లి కాళ్లు మొక్కి..

తప్పక చదవండి
  • కరీంనగర్ మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ పూజలు
  • నామినేషన్‌ పేపర్ల దాఖలుకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు
  • అనంతరం, స్వగృహంలో తన మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్న వైనం
  • బండి సంజయ్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

కరీంనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నేడు మహాశక్తి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన నివాసానికి వచ్చి అక్కడ తన మాతృమూర్తికి పాదాభివందనం చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ పై బిజెపి బండి సంజయ్ ని మరోసారి బరిలోకి దింపింది. దీంతో ఇవాళ సంజయ్ నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గంగుల కమలాకర్ పై ఓటమిపాలైన సంజయ్ వెనక్కి తగ్గలేదు. అదిష్టానాన్ని ఒప్పించి లోక్ సభ టికెట్ దక్కించుకున్నాడు. ఎంతో కష్టపడి ఏ మాత్రం ఆశలులేని చోట బిజెపిని గెలిపించి సత్తాచాటాడు. ఇలా ఎంపీగా గెలిచి బిజెపి కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు సంజయ్. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోయి బిజెపిలో సంజయ్ కీలక నాయకుడిగా మారిపోయాడు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంజయ్ తెలంగాణ బిజెపిలో మంచి ఊపు తీసుకువచ్చారు. ఇటీవలే సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినా కేంద్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది బిజెపి.

కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బండి సంజయ్‌ను ఆయన కార్యాలయంలో కలిసారు. ఇరు నేతలు, పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ ఎన్టీఆర్ విగ్రహ చౌరస్తాకు వెళ్లారు. ఈ క్రమంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు