Friday, May 17, 2024

సత్తుపల్లిలో దారుణం .. దళిత నేతకు అవమానం

తప్పక చదవండి

ప్రజాప్రతినిధిగా పోటీ చేసే దళిత అభ్యర్థికే ఈ పరాభవం ఎదురయితే
సత్తుపల్లి నియోజకవర్గంలో సామాన్య దళితుల, గిరిజనుల పరిస్థితి ఏంటి
తెలంగాణ వచ్చిన అంధకారంలోనే పలు ప్రాంతాలు కొట్టుమిట్టాడుతున్నాయి
దళిత మహిళను అవమానించిన బిఆర్ఎస్ నాయకులపై చర్యలెందుకు తీసుకోలేదు.

హైదరాబాద్ :- ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.. గడిచిన నెల 23వ తారీకు సోమవారం సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా రాగమయి దసరా పండగ ఉత్సవాల్లో భాగంగా కల్లూరు మండలంలో పర్యటించారు. ఈ క్రమంలో చెన్నూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మట్టా రాగమయి కల్లూరు గ్రామంలోని ఆడపడుచులను పలకరిస్తూ ఆ గ్రామంలోని రామాలయం వద్దకు చేరుకొని గుడిలోని దేవుని దర్శించుకునేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలేపు రామారావు, మట్టా దయ రాగమయిని అడ్డుకున్నారు. తానూ ఒక దళిత మహిళని గుడిలోకి ప్రవేశిస్తే గుడి అపవిత్రం అవుతుందని , ఆ కీడు.. ఆకివీడు గ్రామ ప్రజలపై పడుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.బీఆర్ఎస్ నాయకుల తీరుతో ఆగ్రహించిన మట్టా దయ రాగమయి అసహనం వ్యక్తం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ ఓ పసిబిడ్డకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా మట్టా రాఘవయ్య మాట్లాడుతూ దేవుని దర్శనానికి వెళ్లిన తనను తన భార్యను కల్లూరు మండలం బిఆర్ఎస్ అధ్యక్షులు పాలకురామారావు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు . దళితులైనందున తమ పై ఈ విధమైనటువంటి దాడి చేయడం బీఆర్ఎస్ పార్టీ అరాచకానికి పరాకాష్టగా ఆయన పేర్కొన్నారు. ఒక దళిత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దళిత మహిళకు ఇలాంటి అవమానం జరుగుతున్నప్పటికీ కనీసం ఎమ్మెల్యే అడ్డుకోలేక పోయారని .. కనీసం ఇప్పటివరకు ఖండించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు, అవమానాలు సర్వసాధారణమై పోయాయనని మట్టా రాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు.. దళితులను అవమానించదమే పనిగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఒక పక్క దళితులను అవమానిస్తూనే దళితులకు దళిత బందు ఎలా వర్తింపజేస్తున్నారని ప్రశ్నించారు ..ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం పథకాల పేరుతొ దళితులను మోసం చేస్తుందని దళితులు జాగ్రత్తగా ప్రభుత్వ నయవంచన విధానాలను గుర్తుపట్టాలని ..ఓటుతో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు .

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు