- పిలుపునిచ్చిన సీఈసీ రాజీవ్ కుమార్..
- ముగిసిన ఈసీ మూడు రోజుల పర్యటన..
హైదరాబాద్ : మూడు రోజుల పర్యనటన అనంతరం హైదరాబాద్ తాజ్ కృష్ణాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈసీ. రాబోయే ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొనాలని సీఈసీ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలతో మేము ముందుగా సమావేశమయినట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయం పరిమితి పెంచాలని పార్టీలు కోరినట్లు వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ సంస్థలతో కూడా అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం 3 రోజుల పాటు పరిశీలించిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా హైదరాబాద్లోనే ఉన్నారు సీఈసీ, ఇద్దరు కమిషనర్లు.