మన దేశంలో ధనికులు బిజీ బిజీగా
విలాసవంతంగా గడుపుతున్నారు..
జీవన భారం భరించలేక కడుపులు
మాడ్చుకుంటున్న పేదలు
ఈ అసమాన భారతంలో.. ప్రాణం లేని
మతాల దేవుళ్లకు గుళ్ళు, చర్చిలు, మసీదులు
కడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి..
పేదలకు నిలువ నీడ లేదు..
పూట గడవడం లేదు!
దేశం (రాష్ట్రాల)లో అప్పులు పెరిగిపోతున్నాయి..
నాయకుల ఆస్తులూ పెరిగిపోతున్నాయి..
ఎక్కడ పోతుంది ఈ సంపద?..
పేదరికం, నిరుద్యోగం, అవినీతి నిర్మూలించకుండా..
పాలన ఇలానే సాగితే ఏమైపోతుంది ఈ దేశం..
ఆకలి, అవసరం తీరకపోతే ప్రజలు దేనికైనా వెనుకాడరు
తస్మాత్ జాగ్రత్త..!