పదవుల కోసం..
పైసల కోసం..
రోజుకో పార్టీ మారేటోళ్లను
చూసి ప్రజలు య్యాక్..తూ…
అని ఉమ్మేస్తున్నారు.
వీళ్లు చెప్తే మేము ఓట్లు వేస్తామని..
భ్రమలో ఉన్న లీడర్లకు
బుద్ధి చెప్తమంటున్నరు..
డబ్బులు, మద్యం ఇస్తే ఓట్లేసే
రోజులు పోయాయని ఓటర్లు ఏకమైతుండ్రు..
పవిత్రమైన ఓటు వేసి
స్వచ్ఛమైన నాయకున్ని
ఎన్నుకుంటమంటుండ్రు…
ఓటరన్నకు కోపమొస్తే అవినీతి
నాయకుల కొంపలు ముంచేటట్టుండ్రు..
గిదే గనుక జరిగితే ఈ సారి
ఎన్నికల్లో గెలిచేది ఇక ప్రజలే…
నాయకులు కాదు..
` నాగిరెడ్డి కెరెల్లి