- నిరుద్యోగ భృతితో నిరుద్యగులకు మోసం
- 30శాతం వాటాల కోసం పనుల నిర్వహణ
- బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను దగా చేశారన్నారు. ప్రతి పనికీ పర్సెంటీజలు అలవాట య్యిందన్నారు. నివారం విూడియాతో మాట్లాడుతూ.. 30 శాతం వాటాల ప్రభుత్వం మళ్ళీ వస్తే.. తెలంగాణలో అరాచకం రాజ్యమేలు తోందన్నారు. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. భూములమ్మి ఉద్యోగు లకు జీతాలు ఇస్తున్నారని, అమ్మకాలపై ఆధాపడి కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బైఎలక్షన్స్లో ఈటలను ఓడిరచటం కోసమే దళితబంధు పథకం తీసుకొచ్చారన్నారు.పెట్రోల్, డీజిల్పై టాక్స్ తగ్గించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పొదుపు సంఘాల ఉసురు పోసుకుంటున్నారన్నారు. కేసీఆర్ హాయాంలో తెలంగాణలో వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు వస్తాయని అన్నారు. తొమ్మిదేళ్ళల్లో పేదలకు ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లో ప్రగతిభవన్ కట్టుకున్న కేసీఆర్కు పేదల ఇళ్ళపై చిత్తశుద్ధి లేదన్నారు. పేదల గొంతు కోయటం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అంటూ వ్యాఖ్యలు చేశారు. బలిదానాలతో వచ్చిన తెలంగాణ కేసీఆర్ పాలనలో దగా పడిరదన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని.. మాఫియాలు తెలంగాణను పాలిస్తున్నాయని మండిపడ్డారు. 35 లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామన్న కేసీఆర్ హావిూని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సొంత జాగ ఉంటే ఇల్లు కట్టుకోవటానికి డబ్బులిస్తామనటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర సర్కార్ పేదలకు ఇళ్లు కడితే.. కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ బీజేపీ తీసుకుంటోందని తెలిపారు. నాలుగు నెలల తర్వాత కేసీఆర్ గ్దదె దిగటం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ లోపల, బయట డబుల్ బెడ్రూం ఇళ్ళపై పేదలను మభ్యపెడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పక చదవండి
-Advertisement-