- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్
- ఈ ఇంజెక్షన్ సింగిల్డోస్ ఖరీదు రూ.17 కోట్లు
- ఈ విషయంపై మోడీని కలిసిన కర్ణాటక సీఎం
ఈ ప్రపంచంలోనే ఖరీదైన ఈ ఇంజెక్షన్ పేరు జోల్జెన్స్మా. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి ఈ ఇంజెక్షన్ను ఇస్తారు. ఇది భారతదేశంలో ఆమోదించబడనప్పటికీ, వైద్యుని సిఫార్సు, ప్రభుత్వ ఆమోదం ద్వారా దీన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ మెడిసిన్ ప్రయోజనంతో పాటు, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మందులలో ఒకటి. ఒక్క డోసుకు దీనికయ్యే ఖర్చు దాదాపు రూ. 17 కోట్లు. దీని ధర పలు సంఘటనల ద్వారా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవలే ప్రధాని మోడీని కలిసి విషయాన్ని ప్రస్తావించారు. 15నెలల చిన్నారి ట్రీట్మెంట్ కు సహాయం చేయాలని అభ్యర్థించారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లలో ఒకటైన ఈ జోల్జెన్స్మా.. రూ. 17 కోట్లు కావడం.. కొన్ని కేసుల్లో వీటిని విదేశాల నుంచి తెప్పించడం.. ఆ ఇంజెక్షన్ కొనేందుకు బాధితులు.. విరాళాలు సేకరించడంతో పలు మార్లు ఇప్పటికే వార్తల్లో నిలిచింది. అయితే ఇటీవల కర్ణాటకలో ఇలాంటిదే ఒక వెన్నెముక కండరాల క్షీణత కేసు నమోదైంది. 15 నెలల చిన్నారికి ఈ అత్యంత అరుదైన వ్యాధి సోకడంతో ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రస్తావించారు. ఆ15 నెలల చిన్నారి ట్రీట్మెంట్కు సహాయం చేయాలని ప్రధాని మోడీని కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఈ అత్యంత ఖరీదైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ను స్విస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన నోవార్టిస్ తయారు చేస్తుంది. దీన్ని స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జన్యు సంబంధమైన వ్యాధికి చికిత్స అందించేందుకు రూపొందించారు. క్లీవ్ల్యాండ్ క్లినిక్ వెబ్సైట్ ప్రకారం.. వెన్నెముక కండరాల క్షీణత అనే వ్యాధి సోకిన వారికి.. నరాలు, కండరాలపై ప్రభావం పడుతుంది. ఈ వ్యాధి సోకిన వారి కండరాలు బలహీనంగా మారతాయి. అయితే ఈ వ్యాధి అనేది ఎక్కువగా అప్పుడే పుట్టిన శిశువులు, చిన్న పిల్లలకు సోకుతుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ పెద్ద వయసు వారిలో కూడా కనిపిస్తోంది. అయితే ఈ దారుణమైన వ్యాధితో ఒక్క అమెరికాలోనే సుమారు 10 వేల నుంచి 25 వేల మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారని కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు తెలిపాయి.