Friday, April 26, 2024

క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవం..

తప్పక చదవండి

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కూకట్ పల్లి 124 డివిజన్, అల్ల్విన్ కాలనీ, ఆదిత్య సుభాష్ టెన్నిస్ అకాడమీ ఆర్గనైజ్ చేసిన నాన్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో, అండర్ టెన్ అండర్ 12, అండర్ 14 బాలురు, బాలికలు మిక్స్ డ్ ఈవెంట్స్ లో పాల్గొనడం జరిగింది. మెన్ సింగల్స్, డబుల్స్ కూడా జరిగాయి. ఇందులో 100 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ నుండి వీరు పాల్గొనడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ తరఫున సీనియర్ జర్నలిస్ట్ వడ్ల మధుసూదన్ చారి విచ్చేసి, టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి మోమెంటోలు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిత్య సుభాష్ టెన్నిస్ అకాడమీ నిర్వాహకులు, చీఫ్ కోచ్ కే.నర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ తరపున సీనియర్ జర్నలిస్ట్. వడ్ల మధుసూదన్ చారి మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అంతే కాకుండా అంతర్జాతీయంగా క్రీడల్లో పాల్గొనడం వల్ల మన దేశానికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఇలాంటి ఒక క్రీడలకు ప్రోత్సాహం ఇస్తూ కే. నరసింహ తానే ఆర్గనైజర్ గా ఉంటూ, కోచ్ గా కూడా వ్యవహరించడం ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడలు మరెన్నో ఆయన నిర్వహించాలని భవిష్యత్తులో మంచి క్రీడాకారులను మన దేశానికి అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆదిత్య సుభాష్ టెన్నిస్ నిర్వాహకులు, చీఫ్ కోచ్ కే. నరసింహ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో ఆసక్తితో కనబరిచి తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించి వారికి సరైన శిక్షణ అందించి వారిని ఒక స్థాయిలో చూడాలన్నదే నా కోరిక అని తెలిపారు. ఇప్పటికే 40 నేషనల్ టైటిల్స్ కొట్టామని ఇంకొంత మంది ఇంటర్నేషనల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా తెలిపారు. ఇంకా ఇలాంటి క్రీడలను మరెన్నో ప్రోత్సహించి భారతదేశానికి మంచి క్రీడాకారులని అందించడమే నా కర్తవ్యం అని తెలిపారు. అదేవిధంగా నేను చేస్తున్న ఈ కృషికి ప్రభుత్వం కానీ లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ తన వంతు మాకు తోడుగా నిలిస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొన్నందుకు కాను క్రీడాకారులకు కూడా భవిష్యత్తులో స్పోర్ట్స్ కోట లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ మా కోచ్ మాకు అందించిన ప్రోత్సాహం, ట్రైనింగ్ వళ్ళనే మేము ఈ విజయం సాధించగలిగామని, ఈ విజయం ఇంతటితో ఆగకుండా రాష్ట్రస్థాయిలో అంతర్రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొని మా సత్తా చాటుతామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు