Saturday, April 27, 2024

కాంట్రాక్ట్ ఉద్యోగి.. కళ్లుచెదిరే ఆస్థులు..

Lokayukta doing searches..

తప్పక చదవండి
  • అవినీతి తిమింగలం మధ్యప్రదేశ్‌ లో కాంట్రాక్టు ఉద్యోగి హేమా మీనా..
  • ఆమె నివాసంలో సోదాలు చేస్తున్న లోకాయుక్త..
  • జీతం నెలకు రూ.30 వేలు.. వెనకేసిన ఆస్థులు రూ.7 కోట్లు..
  • రూ.30 లక్షల విలువ చేసే అత్యాధునిక టీవీ..
  • రూ. కోటితో విలాసవంతమైన ఇల్లు.. అందులో మొబైల్‌ జామర్లు..
  • 100 కుక్కలు.. గిర్ జాతి పశువులు.. 20 లగ్జరీ కార్ల మెయింటనెన్స్..
  • గురువారం నుంచి కొనసాగుతున్న విస్తృత సోదాలు..

భోపాల్, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : ఆమె ఒక ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగి.. ఆమె సంపాదించిన ఆస్థులు చూసిన అధికారులకు కళ్ళు చెదిరిపోయాయి.. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ గా విధులు నిర్వహిస్తున్న హేమ మీనాపై అనుమానం రావడంతో ఆమె ఇంట్లో లోకాయుక్త అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో మీనా ఆస్థుల చిట్టా చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు.. ఆమె ఆదాయానికి మించి భారీగా ప్రాపెర్టీస్ కూడబెట్టినట్లు గుర్తించారు. భోపాల్‌ లోని హేమా మీనా నివాసంలో లోకాయుక్త అధికారుల సోదాలు గురువారం ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో మరింత షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమె నెల జీతం కేవలం రూ.30 వేలు మాత్రమే. అయినప్పటికీ ఇంత మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె జీతంతో పోలిస్తే ఆస్తుల విలువ 232 శాతం ఎక్కువ. 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్‌ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్‌ అత్యాధునిక టీవీని అధికారులు గుర్తించారు. హేమా తన తండ్రి పేరుమీద 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేసి అందులో రూ.కోటి వెచ్చించి విలాసవంతమైన ఇంటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌, మొబైల్‌ జామర్‌లు, ఇతర విలువైన వస్తువులను కూడా అధికారుల సోదాల్లో బయటపడటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది..

అంతే కాకుండా సుమారు 20 వాహనాలు హేమా మీనా కొనుగోలు చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అందులో ట్రాక్టర్లు, వరినాట్లు యంత్రాలు, హార్వెస్టర్లు, అనేక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో లోకాయుక్త అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో మరిన్ని అక్రమ ఆస్తుల చిట్టా బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు హేమపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు