Saturday, April 27, 2024

15 మందికి ఉరిశిక్ష..

తప్పక చదవండి
  • బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య
  • తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్ఐ సభ్యులు
  • డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన
  • నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు ఉరిశిక్ష
  • తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు

కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులు 15 మందికి కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. దోషులంతా నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థకు చెందిన కార్యకర్తలే కావడం గమనార్హం. 2021 డిసెంబరు 19న అలప్పుజలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ దారుణ హత్యకు గురయ్యారు. పీఎఫ్‌ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలు అతడి ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యుల ఎదుటే అత్యంత పాశవికంగా నరికి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన కేరళ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు.. ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది. రంజిత్ శ్రీనివాసన్ హత్యకు ముందురోజు అంటే డిసెంబరు 18న ఎస్డీపీఐ నేత కేఎస్‌ షాన్‌ను ఒక ముఠా హత్యచేసింది. బయటకు వెళ్లిన అతడు.. ఇంటికి తిరిగొస్తుండగా మార్గమధ్యలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే రంజిత్‌‌ను అత్యంత పాశవికంగా హత్య చేయడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసును దర్యాప్తు చేసిన కేరళ పోలీసులు.. పక్కా అధారాలను సేకరించారు. వీటి ఆధారంగా నిందితులను దోషులుగా నిర్దారించిన మావెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి.. వారికి ఉరిశిక్షను ఖరారు చేశారు. దోషులకు గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. వీరంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని, బాధితుడ్ని తన తల్లి, భార్య, కుమారుడి కళ్లేదుటే అత్యంత క్రూరంగా చంపేశారని, నేరాలలో ఇది అరుదైందని వాదించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు