Sunday, May 5, 2024

అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాలి

తప్పక చదవండి
  • విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి నిలుస్తోంది
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో పొరపాట్లకు తావీయరాదు
  • ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు, చేయూత, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
  • కలెక్టర్లతో సమీక్షించిన సిఎం జగన్‌

అమరావతి : అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి ఉండాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేశారు. వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నాం.. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌లాంచ్‌ కార్యక్రమాలు ఉంటాయి.. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్‌ చేసుకోవాలన్నారు. జనవరి 1వ తేదీ నుంచి వైయస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.3వేలకు పెంపు.. రూ.3 వేలకు పెన్షన్‌ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం.. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నాం.. జనవరి 1 నుంచి 8వ తేదీ వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు నెలకు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం.. గతంలో పెన్షన్ల సంఖ్య 39 లక్షలు, ఇప్పుడు 66 లక్షలు ఉన్నారు.ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్దిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలన్నారు. రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.. జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుంది. నాలుగో కార్యక్రమం వైయస్సార్‌ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది.. ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరికీ 8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్‌ కానుక కార్యక్రమం జరుగుతుంది. ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం.. మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,,195 కోట్లు ఇచ్చాం.. చివరి విడతగా 6,394 కోట్లు ఇస్తున్నాం.. జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.. ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ది పొందారు. మహిళల్లో సుస్థర జీవనోపాథి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం అన్నారు. పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత లబ్దిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి.. పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి ఈ బహుమతులు ఇస్తాం.. ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి. ఇక, జనవరి 19 విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. రూ.404 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్‌ విగ్రహం నిలుస్తుందని సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్‌ సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం. ఆదివారమైనా, పండుగైనా సరే ఒకటో తారుఖీన చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం. ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగామన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి. పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా నేను 3వ తేదీన కాకినాడలో పాల్గొంటున్నాను. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తేదీనే ప్రారంభం అవుతుంది. ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్‌ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీనిపె షెడ్యూలు చేసుకోవాలి. 8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్‌ కానుక కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్‌తోపాటు నా తరఫున లేఖను కూడా లబ్దిదారులకు అందించాలి. అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్దిదారులకు చేరవేయాలి. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, ఉత్సహవంతులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ అందిస్తున్నాం. దీనికోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను నెలకొల్పాం. దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్‌ డబ్బు ఇవ్వలేదు. మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసింది. ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి లబ్దిదారులకు తెలియాలి. ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం అని సీఎం తెలిపారు. మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలు పూర్తిగా కుదేలై పోయాయి. ఏ గ్రేడ్‌, బి గ్రేడ్‌ సంఘాలు మరింతగా పడిపోయాయి. 18శాతం పైచిలుకు అక్కౌంట్లన్నీకూడా అవుట్‌ స్టాండిరగ్‌, ఎన్‌పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్దిదారులకు అందించగలిగాం. అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్‌పీఏలు 0.3శాతానికి చేరాయని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు