Sunday, April 28, 2024

చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్..

తప్పక చదవండి
  • ఏపీ రాజకీయాల్లో సంచలనం..
  • రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని తీర్పు చెప్పిన ఏసీబీ కోర్టు..
  • 8 గంటలుగా ఉత్కంఠగా సాగిన వాదోపవాదాలు..
  • స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రదారి అన్న సీఐడీ..

అమరావతి : ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు శనివారం నంద్యాలలో అరెస్టు చేసి.. విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. దీంతో 40 గంటలుగా ఉత్కంఠ నెలకొంది. 34 అభియోగాలను నమోదు చేసిన సీఐడీ.. చంద్రబాబును ప్రశ్నించిన అనంతరం.. సీబీఐ కోర్టులో ఆదివారం తెల్లవారుజామున ప్రవేశపెట్టింది. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రదారి అని సీఐడీ ఏసీబీ కోర్టుకు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. మొత్తం 28పేజీలతో కూడిన చంద్రబాబు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జరిగిన తీరును సీఐడీ వివరించడంతోపాటు చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్‌ అయ్యిందని తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. దీంతో స్కిల్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సుధీర్ఘంగా వాదనలు కొనసాగాయి.. సుమారు 8 గంటలపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.. దాదాపు 40 గంటల ఉత్కంఠకు ఆదివారం సాయంత్రం తెరపడింది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున సిద్థార్థ లూత్రా, పోసాని వెంకటేశ్వర్లు తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో పెట్టిన సెక్షన్ 409పై బలంగా వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు