- ధరణితోనే రైతుబంధు వస్తోంది
- కాంగ్రెస్ వస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ తప్పదు
- పైరవీకారులు, దళారులు కూడా వస్తారు
- మీ భూములను కాపాడుకుంటారా లేదా
- బీజేపీ, కాంగ్రెస్లకు బుద్ది చెప్పండి
- మతపిచ్చి బీజేపీని చెత్తకుప్పలో వేయండి
- ఐటి రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ
- పెట్టుబడులతో పెరగిని రాష్ట్ర ఆదాయం
- కరెంట్ సమస్యలు పరిష్కరించుకుని ముందుకు
- నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రచారంలో సీఎం కేసీఆర్
నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతుల భూములు సేఫ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికే ప్రభుత్వం అధికారం ఇచ్చిందని.. మరి ఈ అధికారాన్ని మీరు కాపాడుకుంటారా.. కాంగ్రెస్కు అప్పజెప్పి పొడగొట్టుకుంటారా.. అని కేసీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు సేఫ్గా ఉన్నాయి. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికి అధికారం ఇచ్చింది ప్రభుత్వం. మీ భూమి హక్కు మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. ఈ అధికారం ప్రభుత్వం మీకు ఇచ్చింది. ఈ అధికారాన్ని మీరు కాపాడుకుంటారా..? కాంగ్రెస్కు అప్పజెప్పి పొడగొట్టుకుంటారా..? మీరు నిర్ణయం చేయాలి. రైతుబంధు డబ్బులు ఎలా వస్తున్నాయి.. మేం హైదరాబాద్లో విడుదల చేస్తే సెల్ఫోన్లు టింగ్ టింగ్మని మోగుతున్నాయి. బ్యాంక్కు వెళ్లి చూస్తే డబ్బులు మీ ఖాతాలో ఉంటున్నాయి. ఆ డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొంటున్నారు. మరి ఇవాళ ధరణి ఎత్తేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి. ఇవన్నీ పోతే వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్టు అవుతది అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ పైరవీకారులు, దళారులు వస్తరు. ఇప్పుడు ఎవరికి లంచం ఇవ్వకుండానే మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడంటే మళ్లా భూ కబ్జాలు, పైరవీకారులు, పాత రిజిస్టేష్రన్ పద్ధతి, పడిగాపులు పడి ఉండాలి, పట్టా కోసం ఏడాది తిరగాలి, దానికి ముట్టజెప్పేది ముట్టజెప్పాలి. ఇవన్నీ చూశాం. భూమి అమ్మితే, కొంటే ఆర్డీవో ఆఫీసుకు పోవాలి.. ఇచ్చేటోనికి ఇవ్వాలి. ఇవాళ ఆ బాధ లేదు.. ఇవాళ నిమిషాల్లో మ్యుటేషన్, రిజిస్టేష్రన్ అయిపోతుంది. బాజప్త వెబ్సైట్లో వచ్చేస్తుంది. దాన్ని ఎవరూ కూడా కదిరలించలేరు. ఇలాంటి ధరణిని తీసేస్తరట. ఇంత క్లీన్గా ఉన్న వ్యవహారం మళ్లీ మురికి కుంటగా కావాల్నా..? ఇది పెద్ద ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ ఎత్తేస్తామని వాళ్లు కుల్లా చెప్తున్నారు.. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు. కాబట్టి చర్చ పెట్టి ఏ పార్టీకి అధికారం ఇస్తే బాగుంటదని ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు. మనం కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్నాం. కేసీఆర్ కంటే ఎత్తు, దొడ్డుగా ఉన్నోళ్లు సీఎంలు అయ్యారు. కానీ మంచినీళ్ల గురించి ఆలోచించలేదు.. తీసుకురాలేదు. ఎన్ని బాధలు పడ్డాం మంచినీళ్లకు. ఇప్పుడు ఆ బాధ లేదు. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం. ఈ మాత్రం పని వారు ఎందుకు చేయలేదు. కేసీఆర్ కిట్ గురించి ఎవరూ ఆలోచించలేదు. గర్భిణులను అమ్మ ఒడి వాహనం ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లి, కాన్పు అయ్యాక మళ్లా ఇంటి దగ్గర వదిలిపెడుతున్నాం. హాస్పిటల్కు డబ్బులు కట్టేది పోయి ఉల్టా గవర్నమెంట్ పైసలు ఇస్తుంది. దీంతో పేదలకు బాధ తప్పింది. కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కండ్లద్దాలు ఇచ్చాం. ఇవన్నీ మానవీయ కోణంలో చూశాం. సంపద పెరిగిన కొద్ది పంచుకుంటూ పోతున్నాం. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని చెప్పి ఇన్ని కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తున్నాం. దయచేసి ఇవన్నీ ఉండాల్నా.. పదేండ్లు పడ్డ శ్రమ వృథా కావాల్నా.. అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రంలో మళ్లీ పాత కథనే రావాల్నా..? ఇవన్నీ ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడు.. ఆయన ఇండి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల పనులు చేసిపెట్టే ప్రజా నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక్కడ మంచిప్ప రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. అది త్వరలోనే పూర్తవుతది. ఇజ్రాయెల్ టెకన్నాలజీతో మూడు ఎకరాలకు ఒక ఔట్లెట్ పెట్టి ఈ నీళ్లు తీసుకువస్తాం. ఈ ప్రాజెక్టు కింద బాల్కొండ, నిజామాబాద్ రూరల్ కలిసి ఉంది. అది పూర్తయితే ఈ రెండు నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయి. ఆ రిజర్వాయర్ బాధితులు ఉంటే మంచి నష్టపరిహారం ఇద్దాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు. బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వం కూడా పెన్షన్ ఇవ్వలేదు. బీడీ కార్మికుల బాధలను కండ్లారా చూశాను. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నారు. కొత్త వారికి కూడా పెన్షన్ ఇస్తాం. రాష్ట్రం ఏర్పడ్డాక 103 డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పాం. గతంలో మూడే సెంటర్లు ఉండే. కిడ్నీ రోగులకు కూడా 2 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నాం. పెన్షన్ అందుకుంటున్న వారంతా పేదోళ్లు కాబట్టి 5 వేలకు పెంచుతామని ఇటీవలే ప్రకటించానని కేసీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ బీమా చేపిస్తాం అని చెప్పినం. అందరికి చేపిస్తాం. గల్ఫ్ వలసపోయిన కుటుంబాలకు కూడా బీమా వర్తింపజేస్తాం. ప్రతి ఒక్కరికి బీమా వస్తది. కులం, మతం, జాతి అనే తేడా లేకుండా అందరూ సమానమని భావించి, ప్రజల అవసరాన్ని బట్టి వాళ్లకు చేసుకుంటూ పోతున్నాం. ఈ విధంగా మంచి పద్దతుల్లో రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చాం. మరి దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక్క కేసీఆరే కొట్లడడు. మీరు కూడా కొట్లాడాలి. ఈ ఎలక్షన్లనో మీరే కొట్లాడాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. వాళ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. గోవర్ధన్ ప్రజల నాయకుడు. ఆయన ప్రజా ఎమ్మెల్యే. ఆయన ఇంటి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటరు. ఎంత మంది వచ్చినా వారి పనులు చేసి పెడుతడు. సీనియర్ నాయకుడు.. మంచి నాయకుడు కాబట్టి పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఆయన కోరినటువంటి పనులను చేసి పెట్టే బాధ్యత నాది. అందులో ఏం ఇబ్బంది లేదు. మంచి నాయకుడిని గెలిపించాలని కోరుతున్నానని కేసీఆర్ కోరారు. కార్యక్రమంలో అభ్యర్థి బాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్లతో దేశానికి రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ రెండు పార్టీలను అధికారానికి దూరంగా పెట్టాలన్నారు. బిఆర్ఎస్ మాత్రమే నిఖార్సయిన ప్రజల పార్టీ అంటూ.. మరోమారు బిఆర్ఎస్ను గెలిపించాలన్నారు. మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి ఓటువేస్తే ఓటేస్తే మోరీల పారేసినట్లేనని.. కాంగ్రెస్కు వేయడం కూడా ఇంకా వేస్టేనని అన్నారు. ఆదిలాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జోగు రామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ లోయర్ పెన్గంగా అని ఊరించారు. ప్రతి ఎలక్షన్లో ప్రామిస్ చేసుడే. ఒకే ఒక్కడు జోగురామన్న తన మాట నెలబెట్టుకొని చనకా కొరటా బ్యారేజీని పూర్తి చేయించాడు. ఆదిలాబాద్ చరిత్రలో ఎవరూ చేయలేదు. జోగు రామన్న ఒక్కడే నా వెంబడి పడి.. నన్ను కూడా పెన్గంగ కాడికి తీసుకువచ్చి చనకా కొరటా చేయిస్తున్నడు.
మన వద్ద నీటి తిరువా రద్దు చేశాం. ఏడాదిన్నర లోపే కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. 24 గంటల కరెంట్ రైతాంగానికి ఫ్రీగా ఇస్తున్నాం. రైతుబంధు అనే పథకం గురించి జమానాలో వినలేదు. గత గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదు.. ఆలోచించలేదు. మొట్టమొదటిసారి రైతుబంధును పుట్టించిందే కేసీఆర్. ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందుతుంది. రైతులు పండిరచిన ధాన్యాన్ని కొంటున్నాం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే వారంలోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం. వీటితో రైతుల ముఖాలు తెల్లవడుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు. రైతుబంధు దుబారానో లాభమో రైతులు తేల్చాలి. మూడు గంటల కరెంట్ సరిపోతదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి. రైతులందరూ 10 హెచ్పీ మోటార్ పెట్టుకోవాలని రేవంత్ అంటున్నారు. 3, 5 హెచ్పీ మోటారు ఉంటది రైతుల వద్ద. ఇప్పుడు 10 హెచ్పీ మోటార్ ఎవడు కొనియ్యాలా..? వాడి అయ్యా కొనియ్యాల్నా.. యాడికెళ్లి రావాలి. మన వద్ద 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఆలోచించాలి. కరెంట్ బిల్లు ఏంది.. ఎన్ని అవస్థలు.. ఎన్ని లంచాలు గతంలో. ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలడం లేదు. ఏ బాధ లేదు. మంచిగా రైతు పండిరచుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయి. ఈ పద్ధతి పోవాలని అంటున్నారు కాంగ్రెసోళ్లు. వారు చాటుకు చెప్తలేరు.. టీవీ ఇంటర్వ్యూల్లో భాజప్తా చెబుతున్నారు. వీటి గురించి ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనను, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను బేరిజు వేసుకుని, ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.మన దేశానికి స్వాతంత్యర్ర వచ్చి 75 ఏండ్లు అవుతుంది. కానీ ప్రజాస్వామ్య పక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు. ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి.