Monday, April 29, 2024

వైసిపితో అవిూతువిూకే టిడిపి సిద్దం

తప్పక చదవండి
  • లోకేశ్‌ పాదయాత్రతో మళ్లీ దూకుడు
  • నేడు తిరుమలకు రానున్న బాబు
  • బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్‌

అమరావతి : ఎపిలో అధికార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న తీరుతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చంద్రబాబు కేసుల్లో బెయిల్‌ పొందారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక తన రాజకీయ పర్యటనలపై విధాన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే లోకేశ్‌ మళ్లీ తన యువగళం పాదయాత్రను చేపట్టారు. తాజా రాజకీయాల నేపథ్యంలో ఇక వైసిపితో అవిూతువిూ అన్నట్లుగా టిడిపి ఉంది. జగన్‌ అవినీతిపై యుద్దం చేస్తామని లోకేశ్‌ ప్రకటించారు. మరోవైపు రాజధాని రగడ కొంత తగ్గినా..విశాఖ వైపు సిఎం జగన్‌ అడుగులు వేస్తున్నారు. బాబు విశాఖకు వ్యతిరేకం అన్న ముద్ర వేస్తున్న వైసిపి విశాఖను రాజధాని చేయాలన్న పట్టుదలతో అమరావతిని పక్కన పెట్టారు. దీనిపై కోర్టులో కేసు తేలాల్సి ఉంది. అమరావతి ఉద్యమం కూడా తారాస్థాయికి చేరింది. విశాఖ ఉద్యమం కూడా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో విశాఖ రాజధానికి బాబు వ్యతిరేకం అంటూ ప్రచారం కూడా చేశారు. మొత్తంగా ఇప్పుడు వైసిపిని టిడిపి టార్గెట్‌ చూస్తూ పోతున్నది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో బిజెపి,జనసేనలు కూడా తమవంతుగా పోరాడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్‌ మేనిఫెస్టో, నవరత్నాలూ అంటూ ఒక్కోటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. డబ్బుల పందేరంతో ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారి పోయింది. పాలనలో బిజీగా ఉంటూనే టిడిపిని అడ్డుకునేలా వైసీపీ నేతలకు జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంది. మొత్తం అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అంతర్గత కలహాలు వీడి పార్టీకోసం పనిచేయాలని గట్టిగానే శ్రేణులకు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతి జిల్లాలో ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల విభేదాలతో కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి జగనేమో నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశాలిస్తున్నారు. కానీ నేతలేమో బాహాటంగానే తమ విభేదాలను ప్రదర్శిస్తున్నారు. టిడిపిని అడ్డుకోవడం ద్వారా అందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రధాన కర్తవ్యం టిడిపిని ఎండగట్టడం అన్న సూత్రంతో ముందుకు సాగాలని నిర్ణయించడంతో అడ్డుకుంటున్నారు. ఇకపోతే నేతల అరెస్ట్‌తో వైసిపి తీరుపైనా ప్రజల్లో అసహనం నెలకొంది. టిడిపి నేతలను ఏదో ఒక కారణంతో అరెస్ట్‌ చేసి వేధించడం పనిగా పెట్టుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు