Thursday, May 2, 2024

జడ్జి జయకుమార్‌ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

తప్పక చదవండి
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో జయకుమార్ తీర్పు
  • జయకుమార్ తీర్పును తప్పుబట్టిన సుప్రీం తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. రాజ్యంగబద్ద వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారు? అంటూ ప్రశ్నిస్తు అసహనం వ్యక్తిచేస్తు సస్పెన్షన్ ను విధించింది.అయితే.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ నమోదైన కేసులో.. విచారణ జరిపిన జడ్జి జస్టిస్ జయకుమార్‌ కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌‌ను టాంపరింగ్ చేశారన్న ఆరోపణపై దాఖలైన పిటిషన్‌ మీద విచారించిన జడ్జ్ జయకుమారు.. శ్రీనివాస్‌ గౌడ్‌ సహా 10 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌ గౌడ్ మహాబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయగా.. అందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయని.. అవి బయటకు రాకుండా అధికారులతో కలిసి శ్రీనివాస్ గౌడ్‌ తెర వెనుక వ్యవహరం నడిపారని పలువురు ఆరోపించారు. పాత డాక్యుమెంట్‌ స్థానంలో కొత్తది అప్‌లోడ్ చేశారని ఆరోపిస్తున్నారు.

అయితే.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని మహబూబ్‌నగర్‌‌కు చెందిన రాఘవేంద్ర రాజు.. హైదరాబాద్‌ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జయ కుమార్ ధర్మాసనం.. మంత్రితో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కాగా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ధర్మాసనం. దీంతో.. ఎట్టకేలకు మహబూబ్‌నగర్‌ రెండో టౌన్‌ స్టేషన్‌లో శ్రీనివాస్ గౌడ్‌తో పాటు 10 మంది అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో.. నాటి ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్, నాటి స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఉన్నారు.

- Advertisement -

తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎక్కడైతే తప్పు జరిగిందో, ఎవరైతే తప్పు చేశారో వారిని మాత్రమే నిందితులుగా చూడాలి తప్ప.. ఆ సమయంలో ఉన్న అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిందితులుగా పేర్కొనడం సరికాదని కోర్టుకు సీఈసీ విజ్ఞప్తి చేసింది. వారి వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు.. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ జయకుమార్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసిన సుప్రీం కోర్టు.. ఆయన్ను సస్పెండ్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు