Monday, April 29, 2024

తమిళనాడులో రోడ్డు ప్రమాదం…

తప్పక చదవండి
  • తెలంగాణ అయ్యప్ప భక్తుల మృతి
  • చెన్నై బైపాస్‌ రోడ్డు వద్ద ఘటన
  • శబరిమల నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం
  • కారు అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొన్న వైనం
  • అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ముగ్గురు భక్తులు
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

తమిళనాడు రాష్ట్రం మదురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కేరళ మదురై ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. శబరిమల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మద్రాస్‌ బైపాస్‌ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వివరాల్లోకి వెళ్లితే.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు ఓ కారులో కేరళలోని శబరిమలకు వెళ్లారు. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం అదే కారులో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆ వాహనం ఆదివారం మధ్యాహ్నం సమయంలో తమిళనాడులోని మద్రాస్‌ బైపాస్‌ రోడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆ కారు అదుపు తప్పి డివైడర్‌ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు అక్కడికక్కడే మరణించారు. వీరిని సుబ్బయ్య నాయుడు, నరసాంబయ్య, రాజుగా గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందగానే తమిళనాడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్‌ కు తరలించారు. అలాగే మృతదేహాలను కూడా గవర్నమెంట్‌ హాస్పిటల్‌ కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు