- స్పీకర్ ఓంబిర్లాను కలిసి లేఖ అందచేత
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్): సిఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్సభ సీటుకు రాజీనామా చేశారు. స్పీకర్ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. లోక్సభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు రేవంత్ రెడ్డి సమర్పించారు. స్పీకర్తో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మణిక్యం ఠాకూర్ సమావేశమయ్యారు. స్పీకర్తో భేటీ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు.