- అండర్ డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టిన అధికారులు
- ఆదాబ్ హైదరాబాద్కి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
కొత్తూరు : ఈనెల 15న ‘ఆదాబ్ హైదరాబాద్, దినపత్రికలో ప్రచురితమైన ‘హవ్వా,, సిగ్గు,, సిగ్గు’ అనే కథనానికి కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరేందర్ స్పందించి శుక్రవారం అండర్ డ్రైనేజీ పనులకు మరమ్మతులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా కొత్తూరు తహసిల్దార్, మండల ప్రాదేశిక కార్యాలయాల ఎదుట అండర్ డ్రైనేజీ లీక్ కావడంతో దుర్గంధమైన వాసన పెద్దజల్లుతూ కార్యాలయాలకు వచ్చే ప్రజలు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ‘ఆదాబ్ హైదరాబాద్’ కథనాన్ని వెలుగులోకి తేవడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు అండర్ డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేశారు. కథనాన్ని వెలుగులోకి తెచ్చిన ‘ఆదాబ్ హైదరాబాద్’ కు కాలనీవాసులు, అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్న ‘ఆదాబ్ హైదరాబాద్’ ను ప్రజలు అభినందించారు.