Saturday, May 18, 2024

బీసీలను అవమానిస్తారా?

తప్పక చదవండి
  • బీసీలంటే కాంగ్రెస్ కు అంత చులకనా?
  • తక్షణమే బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే
  • బీసీని బీజేపీ ముఖ్యమంత్రి చేస్తామనగానే కులగణన గుర్తుకొచ్చిందా?
  • 50 దేశాన్ని పాలించిన కాంగ్రెస్… ఓబీసీని ప్రధాని ఎందుకు చేయలేదు?
  • డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ కు కుల గణన ఎలా సాధ్యం?
  • దేశంలో ప్రతిపక్ష స్థానం కోల్పోయిన పార్టీ చెబితే నమ్మేదెలా?
  • తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
  • ఆ తరువాతే తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఓట్లడగాలి….
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్

హైదరాబాద్ : అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. భారతదేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే. అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయని పార్టీ కాంగ్రెస్. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి రాహుల్ గాంధీ ఓబీసీల జపం చేయడం కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. మొన్న కేసీఆర్ కొడుకు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయి. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆ తరువాతే బీసీలకు ఓట్లు అడగాలి. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదు. గత పార్లమెంట్ ఎన్నికల నుండి ఆ తరువాత అన్ని ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీట్లను, ఓట్లను సాధించిన పార్టీ బీజేపీ. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన పార్టీ బీజేపీ…తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యం. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. పేదింటి ఓబీసీ బిడ్డ నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. 27 మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా చేసిన పార్టీ బీజేపీ. దళిత, ఆదివాసీ, మైనారిటీ బిడ్డలను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే. ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ. అదే బాటలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేయడం తథ్యం. మరి కాంగ్రెస్ చేసిందేమిటి? 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదు? పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానం కోల్పోయి కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమయ్యాకే ఓబీసీ కులగణన గుర్తు కొచ్చిందా? తెలంగాణలో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పార్టీగా హీనదశకు చేరిన తరువాత ఓబీసీలు గుర్తుకొచ్చారా? పార్లమెంట్ లో పట్టుమని 10 శాతం సీట్లు కూడా లేని పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష స్థానం కోల్పోయి మరణశయ్యపై ఊగిసలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కులగణన ఎట్లా చెేపడుతుందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. అంతెందుకు… ఓబీసీ జపం చేస్తున్న రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు? రాష్ట్రంలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తున్న పార్టీ బీజేపీ. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్దమా? ఓబీసీ కులగణన విషయంలో రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? ఈ మేరకు ప్రకటన చేసే సత్తా ఉందా? కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలపట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో అధికారంలోకిి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ ను బీసీలే రాజకీయ సమాధి చేయడం తథ్యం. బీసీలంతా ఏకమై దమ్ము చూపూ సమయమొచ్చింది. బీసీలను అడుగడుగునా అవమానిస్తునన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు