Tuesday, April 30, 2024

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన ప్రధాని మోడీ

తప్పక చదవండి

ప్రధాని నరేంద్ర మోడీ అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాకు చాదర్‌ పంపించారు. గురువారం నాడు ఢిల్లీలో ముస్లిం మత ప్రముఖులు మోడీని అతని నివాసంలో కలిశారు. అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాలో సూఫీ మత గురువు మొయినుద్దీన్‌ చిస్తీపై కప్పేందుకు చాదర్‌ను అందజేశారు. ప్రధాని మోడీ ఏటా అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిస్తారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలని ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. మొయినుద్దీన్‌ చిస్తీ సమాధిపై చాదర్‌ కప్పే సమయంలో ఆ సందేశం చదువుతారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు