Saturday, May 11, 2024

ఎన్నారైలంతా మళ్లీ మోదీ సర్కారే రావాలనుకుంటున్నారు..

తప్పక చదవండి
  • తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలని కోరుకుంటున్నారు
  • డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివ్రుద్ధి సాధ్యం
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి
  • శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో చిట్ చాట్..

హైదరాబాద్: అమెరికాలో నివసించే భారతీయులంతా మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బండి సంజయ్ తనను కలిసిన మీడియా మిత్రులతో మాట్లాడుతూ… ‘‘ఎన్నారైలకు ఏ సమస్య వచ్చినా మోదీ ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తోంది. ఇయాళ అమెరికాలో ఎన్నారైలంతా గల్లా ఎగరేసుకుని తిరుగుతున్నారంటే మోదీవల్లేనని అక్కడి భారతీయులంతా చెబుతున్నారు’’అని చెప్పారు.

కేంద్రంతోపాటు తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని ప్రవాస తెలంగాణ వాసులు కోరుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివ్రుద్ధి సాధ్యమని అమెరికాలోని తెలంగాణ వాసులంతా నమ్ముతున్నారని చెప్పారు. ‘‘సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలొస్తే హైదరాబాద్ ఖాళీ అవుతుంది. అందరూ స్వస్థలాలకు వెళతారు. అదే తరహాలో రాబోయే ఎన్నికల్లో అమెరికాలో నివాసముంటున్న తెలంగాణ వాసులంతా స్వరాష్ట్రానికి చేరుకుని బీజేపీ పక్షాన ఎన్నికల ప్రచారం చేస్తామని, మళ్లీ మోదీ ప్రభుత్వం రావాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తామని యూఎస్ లోని ఎన్నారైలంతా హామీ ఇచ్చారు.’’అని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు